KDP: పాత కడపలో హిందూ ధర్మం సమాజ ప్రార్థన దేవాలయాల సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, వైసీపీ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు రామాయణాన్ని చదివి ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతకు రామాయణమే స్ఫూర్తి అని పలువురు వక్తలు పేర్కొన్నారు.