PDPL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ధర్మారంలోని రామాలయంలో ఇవాళ భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని, టెంకాయలు సమర్పించారు. ఆలయ పురోహితులు భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మరియు పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.