PDPL: మంథని పట్టణంలోని రావులచెరువు కట్ట మహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 82,653 వచ్చినట్లు ఆలయ ఈవో రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఈవో రాజకుమార్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆరు నెలలకు సంబంధించి ఈ ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రశాంత్, మహిళా భక్తులు పాల్గొన్నారు.