వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వెల్లడించారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నగరంలోని డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.