NTR: మైలవరంలోని బంధగార రోడ్డులో శ్రీరాముల వారి ఆలయం వద్ద వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి ఏడాది ఈ రోడ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది వివాదాలకు దారి తీసే విధంగా కాలువలోని బురదను తీసి అన్నదానం జరిగే చోట వేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.