MNCL: అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందరూ సహకరించాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డీవో రామ్మోహన్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో అడవిలో అక్కడక్కడ అగ్ని ప్రమాదాల సంఘటనల సమాచారం అందగానే సిబ్బందిని పంపి మంటలను ఆర్పి వేస్తున్నామన్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా పంట, తదితర వ్యర్ధాలను అడవి సమీపంలో కాల్చవద్దన్నారు.