KMM: ముదిగొండ మండలం పమ్మి గ్రామ శివారులో గురువారం పోలీసులు మెరుపు దాడి చేసి పేకాటాడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి రూ.7,350 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.