సత్యసాయి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు విరాజిల్లాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్దలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.