JN: బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచ్ స్వర్ణలతను అడిగి ఇళ్ల మంజూరు, నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.