ATP: జిల్లాలో విశేష సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు FCRA రెన్యూవల్ చేయించినందుకు CM చంద్రబాబుకు ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు, కాలువ శ్రీనివాసులు, మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో గురువారం ముఖ్యమంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి రెన్యూవల్ అయ్యేలా కృషి చేసినందుకు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.