SDPT: ఆస్పత్రి సమయ వేళలు పాటించి రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.