E.G: జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్కు విశేష స్పందన లభించిందనీ, మొత్తం 233 మంది పాత్రికేయులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వైద్య శిబిరం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం నిర్వహించారు. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు.