MHBD: కురవి వీరభద్రస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని పురోహితులు నాగేందర్, స్థానిక నేతలు మంత్రి కొండా సురేఖను కోరారు. గురువారం మంత్రిని హైదరాబాద్ కలిసి వినతిపత్రం అందజేశారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని, ఆలయాన్ని ఆధునీకరించాలని విన్నవించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.