AP: కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్ మిగతా మంత్రులతో సమావేశమయ్యారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగలా చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలని, సీనియర్ నేతలను సన్మానించి వారితో మంత్రులు, MLAలు కలిసి భోజనం చేయాలన్నారు. అలాగే పింఛన్ అందేలా చర్యలు తీసుకుందామని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు.