SDPT: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ బీఆర్ఎస్ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేవలం తమ రాజకీయ ఉనికి కోసమే పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే హరీష్ రావు గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. సిద్దిపేటలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.