BHPL: రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో SI సుధాకర్ ఆధ్వర్యంలో “ARRIVE- ALIVE ” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SI సుధాకర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.