మలయాళ హీరో జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. అనుష్క ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2026, మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్కు ఇంకా 5 రోజులు మాత్రమే ఉందని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.