HYD: ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతోందని, దీంతో చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినా కేవలం 496 మందికే ఇచ్చారని వివరించారు.