BHNG: యాదగిరిగుట్ట మండలంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పర్యటించారు. సైదాపూర్ గ్రామంలో పర్యటించి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని నివాసానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే సైదపురం చెరువు నుంచి అలుగు పారుతుండటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.