SRPT: నడిగూడెం మండల కేంద్రానికి చెందిన విశ్రాంత కార్యాలయ సహాయకులు (ఆఫీసు సబార్డినేట్) నరసింహా ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల స్థానిక ప్రముఖులు, తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. నరసింహారావు తన సుదీర్ఘ సర్వీసులో నిజాయితీ గల వ్యక్తిగా గుర్తింపు పొందారని వారు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.