VKB: బంటారంలోని నవోదయ పాఠశాలకు చెందిన నాల్గో తరగతి విద్యార్థులు 12మంది గురుకులాలకు ఎంపికయ్యారు. ఇటీవల వెలువడ్డ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలలో వారు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బాల బ్రహ్మం చారి తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు గురుకులాలకు ఎంపికకావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.