NDL: శ్రీశైలం మండలం సున్నిపెంట అక్కమ్మ సెంటర్ సమీపంలో నివసిస్తున్న నవీన్ (48) గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలకు గాయం ఉండటంతో దాడి చేసి చంపారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సీఐ గంటా సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.