ADB: గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ (ఎస్సీ) కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాల నుంచి పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు బోథ్ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించి వంద శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించడంపై హర్షం వ్యక్తమవుతోంది.