మార్కాపురం జిల్లా సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిని అధికారులతో కలిసి తెలుసుకుంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.