JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఇవాళ ఎస్సై ఎస్.కె. హమీద్ వాహనదారులను తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపించడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన మొదటి గంట అత్యంత కీలకమని, ఆ సమయంలో బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలన్నారు.