సిద్దిపేటలో ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వస్తున్నాయని 37వ వార్డు కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ‘బాలమేళా’లో విద్యార్థులకు స్టీల్ టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ స్టీల్ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు.