JGL: ఎండపల్లి మండలం గొడిసెలపేట శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. బుధవారం సర్పంచ్ కందికట్ల అమృత రాజేశ్ బృందం ఆయన్ను కలిసి శ్రీరామనవమి కళ్యాణానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 లక్షల నగదుతో పాటు 100 సిమెంట్ బస్తాలను విరాళంగా అందజేశారు.