కాకినాడ: సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మార్ని చిలకమ్మ అనే ఒక మహిళకు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదానికి గురైనట్లు స్థానికులు వివరించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.