సత్యసాయి: విదేశీ పక్షుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం చిలమత్తూరు మండలం వీరాపురంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్బంగా వేసవి విడదికి వచ్చే సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమకూరుస్తాం అన్నారు. చెట్ల పై నుంచి కింద పడే పక్షి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక సంరక్షకుడిని నియమించాం అన్నారు.