ASF: జైనూరు మండలం గౌరీ గ్రామంలో జైనూర్- లింగాపూర్ రహదారి మధ్యలో వంతెనను హై లెవెల్ వంతెనగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం లోలెవల్ వంతెనను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. లోలెవెల్ వంతెనతో వర్షాకాలంలో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, హై లెవెల్ వంతెన నిర్మాణంతో ప్రజలకు సౌకర్యం కలుగుతుందన్నారు.