NDL: నంద్యాల మండలం కానాల గ్రామపంచాయతీ పరిధిలోని హై స్కూల్ కొట్టాల గ్రామంలో ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.