TPT: రాపూరు- పెంచలకోన మార్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడేందుకు నిఘా పెంచినట్లు పోలీసులు తెలిపారు.