ప్రకాశం: కొమరోలు మండలంలో పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిచారు. మండల పరిధిలోని యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని స్టాక్ పరిశీలించారు. అనవసరంగా కృత్రిమ కొరతను సృష్టించేందుకు యత్నిస్తే చర్యలు తప్పవని యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.