PLD: సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరై ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. పశువుల రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.