VKB: బొంరాస్పేట మండలం లింగంపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 5వ తరగతిలో గురుకుల సీట్లు సాధించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు శ్రీహరి అన్నారు. ఈ మేరకు ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయురాలు అమూల్యతో కలిసి అభినందించారు. గౌతమ్, అఖిల్ అనే విద్యార్థులు కొడంగల్ గురుకుల పాఠశాలకు అనన్య, కోకట్ గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు తెలిపారు.