NGKL: చారకొండ మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఏవో ఆంజనేయులు తెలిపారు. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 27న సీతారాముల మహా కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.