కాకినాడ జిల్లా జనసేన పార్టీ సమావేశం ఆదివారం సూర్యకళా మందిర్లో జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో క్రియాశీలక సభ్యత్వాన్ని రికార్డు స్థాయిలో పెంచాలని తీర్మానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి, అధికారాన్ని దక్కించిన కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామన్నారు.