GNTR: పాత గుంటూరు యాదవ బజార్లోని రంగ బొమ్మ సెంటర్ సమీపంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ముఖ్యమని తెలిపారు.