సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ధర్మవరం టౌన్లో నోటిఫై చేసిన ఓ బార్ కోసం ముగ్గురు దరఖాస్తుదారుల నుంచి నాలుగు దరఖాస్తులు అందాయి. ఎక్సైజ్ అధికారి గోవింద నాయక్ సమక్షంలో నిర్వహించిన లాటరీలో ఆర్. రవికుమార్ విజేతగా నిలిచారు.