NDL: శ్రీశైలం డ్యాం వద్ద తేనెటీగల దాడి విషాదం సృష్టించింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52)పై తేనెటీగలు దాడి చేశాయి. లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. భయంతో కిందపడిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.