యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ శాఖల అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వేషధారణలు వేసి అలరించారు. తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ పాలనాంశాలపై అవగాహన కల్పించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులు అందజేశారు.