SKLM: ఆమదాలవలస రైల్వే స్టేషన్లో ఫలక్నమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి యువకుడు మృతి చెందినట్లు GRP ఎస్సై ఎం. మధుసూదనరావు బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 35 ఏళ్లు ఉండి, నీలం కలర్ టీ షర్ట్ ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ తరలించినట్లు చెప్పుకొచ్చారు.