ATP: సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడం, పరిపాలనా సామర్థ్యం పెంపుపై చర్చించారు. స్వర్ణాంధ్ర విజన్- 2047 లక్ష్యంగా సింగపూర్లో అమలవుతున్న ఉత్తమ పాలనా పద్ధతులపై రాష్ట్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.