CTR: నగరి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని UTF సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఒకరోజు దీక్షలో భాగంగా వారు 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.