కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్కు కేంద్రమంత్రి కుమారస్వామి శంకుస్థాపన చేయటం శుభపరిణామమని అన్నారు. రూ.1,35964 కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.