NZB: రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామంలో శ్రీరామ మందిరంలో బుధవారం రాత్రి 12 గంటలకు రథోత్సవం, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని జన్మోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.