JGL: వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల విక్రయం ద్వారా రూ.29,900, హుండీ కానుకల ద్వారా రూ.6,298 కలిపి మొత్తం రూ. 36,198 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఆదాయ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది కల్వకుంట్ల అనిల్ రావు, కూకట్ల రాజేందర్, మ్యాత లక్ష్మి పాల్గొన్నారు.