కృష్ణా: ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి ప్రవేశించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతిప్పలో బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సముద్రపు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అటవీ శాఖ ఏలూరు డివిజన్ అధికారులతో కలిసి ఆయన ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు.