ATP: CM చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ లభించిందని ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు లోకేష్ కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.