NRML: విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను మెరుగుపరిచేందుకు వారిని విదేశీ పర్యటనలకు పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 40 మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. మొదటి విడతగా నలుగురు ఉపాధ్యాయులు త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.